భారత కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు కనిష్టానికి పతనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి 0.32 శాతం క్షీణించి రూ. 94.85 వద్ద కొత్త కనిష్ట స్థాయికి చేరింది. ఏప్రిల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తీసుకున్న చర్యల వల్ల తాత్కాలికంగా బలపడిన రూపాయి, ఇప్పుడు ఆ లాభాలను కోల్పోయింది.