ఉక్రెయిన్పై రష్యా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో 17 మంది మరణించగా, 44 మంది గాయపడినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. బుధవారం అర్థరాత్రి నుంచి కీవ్పై దాడులు మొదలయ్యాయి. నగరంలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. క్షిపణుల దాడుల వల్ల నివాస భవనాలు, గిడ్డంగులు ధ్వంసమయ్యాయి. రష్యా రక్షణ శాఖ ప్రకారం, లాజిస్టిక్ హబ్స్, సప్లయ్ కేంద్రాలను ధ్వంసం చేశారు.