మయామి ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను బెలారస్ స్టార్ ప్లేయర్ అరీనా సబలెంక వరుసగా రెండోసారి గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో కోకో గాఫ్పై 6–2, 4–6, 6–3తో విజయం సాధించింది. 2022లో ఇగా స్వైటెక్ తర్వాత ఒకే సీజన్లో ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ గెలిచి 'సన్షైన్ డబుల్' సాధించిన తొలి ప్లేయర్గా సబలెంక రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో సబలెంక, గాఫ్పై ముఖాముఖి రికార్డును 7–6కు పెంచుకుంది.