ప్రతి ఏటా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశాలలో భద్రత, ఆరోగ్యం దినోత్సవాన్ని జరుపుకుంటారు. పని ప్రదేశాలలో ప్రమాదాలు, వ్యాధులను నివారించి సురక్షితమైన ఆరోగ్య పని సంస్కృతిని ప్రోత్సహించడమే దీని ముఖ్యోద్దేశం. ఉద్యోగులు బ్యాక్పెయిన్, మెడనొప్పి వంటి సమస్యలను నివారించడానికి సరైన భంగిమలో కూర్చోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మానిటర్లను కంటి స్థాయిలో ఉంచడం, ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవాలంటున్నారు. చక్కటి జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం కూడా అవసరమని సూచిస్తున్నారు.