TG: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ములకనూరులో సమ్మక్క-సారలమ్మ జతర వైభవంగా జరుగుతోంది. గురువారం ఆలయంలో గద్దెలపైకి అమ్మవార్ల ప్రవేశం జరిగింది. ములకనూరులో వన దేవతలకు స్వాగతం పలుకుతూ ప్రభుత్వం తరఫున పోలీసుల గన్ ఫైర్ చేశారు. అనంతరం అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్ఠించారు. కాగా మేడారం మహాజాతర సందర్భంగా నిన్న రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్నారు.