శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ పేరుతో కొత్త AI ల్యాప్టాప్ను భారత్లో విడుదల చేసింది. రూ.64,990 ధరతో లభ్యమవుతున్న ఈ ల్యాప్టాప్లో Snapdragon X ప్రాసెసర్, 16GB RAM, 512GB స్టోరేజ్, Wi-Fi 7, Dolby Atmos ఆడియో, 1080p కెమెరా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్లస్తో పాటు గెలాక్సీ ఏఐ టూల్స్ కూడా అందిస్తున్నారు. ఇది స్లిమ్ డిజైన్, ఫాస్ట్ చార్జింగ్తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.