దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్తో 'స్పిరిట్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. సినిమా విడుదల కాకముందే.. స్పిరిట్ రూ.2,500 కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తుందని సందీప్ రెడ్డి వంగ తెలిపారు. 2026 చివరిలో సినిమా విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.