సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని సంగమేశ్వర ఆలయంలో ఈరోజు మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. శివ భక్తులు భజనలు, పాటలతో సంగమేశ్వరుని స్తుతించారు. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మునిపల్లి నూతన సర్పంచ్ దంపతులు పాల్గొని, మాఘ పౌర్ణమి, ఆదివారం కలిసి రావడం భక్తులకు శుభప్రదమని తెలిపారు.