ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో తెలంగాణ రాష్ట్రం తెలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్గీకరణతో దళితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పారు. విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పేర్కొన్నారు.