మెదక్ జిల్లాలో ముగ్గురు కుమార్తెలతో కలిసి తల్లి శిరీష అదృశ్యమైంది. ఈ నెల 24 నుంచే వీరు కనిపించకుండా పోయారు. భార్య, కుమార్తెల అదృశ్యంపై శిరీష భర్త స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.