నియోజకవర్గానికి చెందిన పలువురు హైదరాబాదులో కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండగా హైదరాబాదులో కల్తీకల్లు తాగి కల్హేర్ మండలం రాపర్తి గ్రామానికి చెందిన పోచవ్వ, సంజీవనరావుపేట్ గ్రామానికి చెందిన యాదమ్మ, నిజాంపేట్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన రాములు అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి వారిని మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.