నారాయణఖేడ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ముగ్గురు లబ్ధిదారులకు 70 వేల రూపాయల చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పండరి రెడ్డి, మాశు పటేల్, రవి పాల్గొన్నారు.