సంగారెడ్డి: లలితకు ప్రశంస పత్రం, మెమోంటో అందజేత

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వాసర్ తండా కు చెందిన లలితకు వికలాంగుల సంక్షేమ అధికారి లలిత కుమారి ప్రశంసపత్రం, మెమోంటో అందజేశారు. వికలాంగుల దినోత్సవ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అమెను అభినందించి ప్రశంసించారు. వికలాంగులకు చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉందని లలిత అన్నారు. వికలాంగుల సమస్యలపై ఎల్లవేళలా పోరాటం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్