పటాన్చెరు అమీన్పూర్లో కర్రీ ధర విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. రూ. 10కి కూర ఇవ్వలేనని చెప్పడంతో ఆగ్రహించిన జీవరత్నం అనే వ్యక్తి, కర్రీ పాయింట్ యజమాని ఉదయ్ భాస్కర్పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉదయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.