వేసవి సెలవులు, ప్రయాణాల నేపథ్యంలో ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొండాపూర్ ఎస్ఐ సోమేశ్వరి సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ, కుటుంబంతో కలిసి ఊర్లకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు, పోలీసుల సమన్వయంతోనే నేరాలను నియంత్రించడం సాధ్యమవుతుందని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.