పటాన్ చేరు: పూజారులను సన్మానించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి

గురు పౌర్ణమి సందర్భంగా పటాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం సాయినగర్ కాలనీ లోనీ స్థానిక పంచముఖ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గోదావరి తో కలిసి పూజారులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూజారులకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్