మే 10న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో జరగనున్న 10వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల పోస్టర్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఈ పోటీలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.