సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం కమిషనర్ రంగనాథ్ ని తెలుగు వచ్చా అంటూ ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి. ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ హెచ్చరించారు. కమిషనర్ మాట్లాడిన తీరుకు అక్కడున్న వారందరూ చప్పట్ల వర్షం కురిపించారు.