సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రంలో గత ప్రభుత్వం 2019లో 302. 40 లక్షల రూపాయల నిర్మాణ పనులను ప్రారంభించారు. కాగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో డబల్ బెడ్ రూమ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయిందని పలువురు వాపోతున్నారు.