సంగారెడ్డి: ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఎదుట రాస్తారోకో

బస్ పాస్ ఛార్జీల పెంపకంకు నిరసనగా ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదుట శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ.. బస్ పాస్ ఛార్జీల పెంపు వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ‌ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్