సదాశివపేట: 'రైతులకు అండగా సీపీఎం'

సాగు భూములను పరిశ్రమలకు ఎలా తీసుకుంటారని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అరూర్ గ్రామంలో సాగుచేసుకుంటున్న వ్యవసాయ భూములను పరిశ్రమలకు తీసుకోవద్దని ప్రభుత్వం ను కోరారు. రైతులకు అండగా సీపీఎం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్