వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో రాజేందర్ ఆదేశించారు. కందిలోని పిఎసిఎస్ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన ఆయన, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో తార్పలిన్ టవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని కూడా ఆయన తెలిపారు.