సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో విద్యుత్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇసాముద్దీన్ (30) అనే యువకుడు విద్యుత్ ఘాతానికి గురై కాళ్లు, చేతులు, ఛాతిపై తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది రఘురామ్, శరీఫ్ వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించి, బాధితుడిని సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.