హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ అమ్మాయిలను ట్రాప్ చేసే క్రిమినల్స్ పై తీసుకుంటున్న చర్యలు సరైనవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఇంటివద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న పోలీస్ శాఖ నిర్ణయం అభినందనీయమని, మహిళలకు అండగా ఉండాలన్న వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.