సంగారెడ్డి జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి.