సంగారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, వరుసగా మూడుసార్లు చైర్మన్ పీఠం సాధించిన ఘనత తమ పార్టీకే దక్కిందని ఆమె తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆమె కోరారు.