సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ కిసాన్ ఆధ్వర్యంలో సోమవారం జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతి పత్రం సమర్పించారు.