ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పెన్షన్ పెంపు కోసం దివ్యాంగులు ఉద్యమానికి సిద్ధం కావాలని దివ్యాంగుల హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.