ఉపాధ్యాయ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా గౌసోద్దీన్, ప్రధాన కార్యదర్శిగా మారుతి, కోశాధికారిగా కిష్టయ్య, గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా సౌజన్య ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.