సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం సరికాదని అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ సీఎం రేవంత్ రెడ్డి అని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.