స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక దామోదర్ సావర్కర్ 143వ జయంతి సందర్భంగా జనజాగరణ సమితి సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సామరసింహ రెడ్డి మాట్లాడుతూ, మాతృభూమి విముక్తి కోసం అండమాన్ జైలులో బ్రిటీషర్ల చేతిలో నరకయాతన అనుభవించిన పరమ దేశభక్తుడు వీర్ సావర్కర్ అని కొనియాడారు.