సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో శ్రావణ నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నామస్మరణ చేశారు. అనంతరం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు.