కొండాపూర్ మండలం మారేపల్లిలోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో తొమ్మిదవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి లక్ష్మీనారాయణ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వైకుంటపురం దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఈ కల్యాణోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున జై లక్ష్మీనారాయణ అంటూ నామస్మరణ చేశారు.