సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం రాత్రి మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించగా, గురుస్వాములు ఆలపించిన అయ్యప్ప కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం భక్తులతో నిండిపోయింది. అనంతరం పడి వెలిగించి, అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.