నూతన ఎస్‌ఐగా రాజేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా కేరెల్లి రాజేందర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ నరేష్ ఝారసంగం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు.

సంబంధిత పోస్ట్