జహీరాబాద్: మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్లనియామకం

పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన 'సంఘటన్ సృజన్ అభియాన్'లో భాగంగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు సమన్వయకర్తలను అధిష్ఠానం నియమించింది. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను రాష్ట్ర వర్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీకి అప్పగించగా, మెదక్ పార్లమెంటు సమన్వయకర్తగా ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతం నియామకమయ్యారు. ఈ నియామకాలు పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి.

సంబంధిత పోస్ట్