జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాత 23వ వతన్ భాగ్ వార్డు మాజీ కౌన్సిలర్ మేరాజ్ ఉన్నాసా బేగం, కో ఆప్షన్ మెంబర్, కాంగ్రెస్ నాయకులు అక్బర్, మోయిన్తో పాటు పలువురు మహిళా నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాణిక్ రావు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దేవీప్రసాద్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.