హైదరాబాద్లోని అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలీ కేఫ్ చౌరస్తా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిని బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.