ఐపీఎల్ తాజా ట్రాన్స్ఫర్ అప్డేట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రవీంద్ర జడేజా సీఎస్కేను వీడి రాజస్థాన్ రాయల్స్ చేరినట్లు లీగ్ ప్రకటించింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ సీఎస్కేకు మారినట్లు తెలిపింది. మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లకు సంబంధించి జట్ల మార్పులను ఐపీఎల్ అధికారికంగా ప్రకటిస్తూ ఈ వివరాలు వెల్లడించింది.