TG: హైదరాబాద్ మియాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్లోని గోపాల్నగర్లో గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు వేగంగా దూసుకొచ్చి బైకుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాలిసియం హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్న నాగరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.