UP, లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అతని భార్యాపిల్లల ముందే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు దారుణంగా ఈడ్చుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే సదరు వ్యక్తిని నేలపై పడేసి అమానవీయంగా లాక్కెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది, పార్క్ యాజమాన్యంపై విమర్శలు వ్యల్లువెత్తుతున్నాయి.