ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు షఫీకర్ రెహమాన్ బార్క్ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 94. పార్లమెంటులో భారతదేశపు అత్యంత వృద్ధ ఎంపీగా వ్యవహరించిన రెహ్మాన్ బార్క్ మొరాదాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ ఇన్ఫెక్షన్తో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.