ఒకప్పుడు మహిళలంతా సాయంత్రం వేళల్లో ఒక దగ్గరకు చేరి.. పాటలు పాడుకోవడం, పిండి వంటలు చేసుకోవడం వంటివి చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ ఆన్లైన్లో, షాపుల్లో దొరకడంతో వండుకోవడం తగ్గింది. ఈ క్రమంలో మహిళలు తమ జానపద కళలను పక్కన పెట్టి వినోదం కోసం టీవీలకు అలవాటుపడ్డారు. టీవీల్లో ప్రసారమయ్యే సీరియళ్లు భావజాలపరమైన దాడి చేస్తున్నాయి. పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం పెరిగేలా ప్రేరేపిస్తున్నాయి. ఇది మహిళల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.