ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. అమల్లోకి స్టేజ్‌-3 ఆంక్షలు

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు శనివారం జీఆర్‌ఏపీ స్టేజ్‌-3 ఆంక్షలను అమలులోకి తెచ్చారు. అనవసర నిర్మాణ పనులు, కూల్చివేతలు, మైనింగ్‌, రాత్రి క్రషింగ్‌పై నిషేధం విధించారు. డీజిల్‌తో నడిచే పాత వాహనాలకు ఢిల్లీలోకి ప్రవేశం లేదు. ఐదవ తరగతి వరకు పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని, కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్