TG: తొమ్మిదేళ్ల బాలికపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని ఓ గ్రామంలో జరిగింది. వేసవి సెలవుల కావడంతో బంధువుల ఇంటికి వచ్చిన బాలిక.. కూల్ డ్రింక్ కొనేందుకు షాపుకు ఒంటరిగా వెళ్లింది. ఆ సమయంలో లక్ష్మణ్రావు (55) అనే వ్యక్తి బాలికపై అఘాయిత్యం చేశాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అక్కడి నుంచి పారిపోయి పోలీసుల ముందు లొంగిపోయాడు.