వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందిస్తూ.. హిందువుల ఆరాధ్య దైవం, హిందూ సమాజ మనుగడకు కారణమైన శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేసిన దుండగులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ వల్లే హిందూ సమాజం మనుగడ సాధ్యపడిందని ఆయన అన్నారు.