భారత్‌కు షాక్‌.. ఓపెనర్లు డకౌట్‌

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఇద్దరూ ఆడిన తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగారు. ఐర్లాండ్‌ బౌలర్‌ జై మూంద్రా వేసిన బౌలింగ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. 1.1 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ 2/2గా ఉంది. ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు. భారత్‌ లక్ష్యం 155 పరుగులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్