లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులకే ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా 38 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ వేసిన 15.1 ఓవర్కు కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా 22 ఓవర్లకు భారత్ స్కోర్ 66/2గా ఉంది. క్రీజులో శుభ్మన్ గిల్ (11), సాయి సుదర్శన్ (23) పరుగులతో ఉన్నారు.