AP: వైసీపీకి ఆ పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. తునికి చెందిన మరో ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో ఇప్పటివరకు టీడీపీలో చేరిన కౌన్సిలర్లు సంఖ్య 15 కు చేరింది. సోమవారం ఉదయం మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేయగా.. ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. రూపాదేవి, శ్రీను, ప్రభావతి, వెంకటరమణ, నాగలక్ష్మి, తదితరులు టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.