అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఐలాండ్లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో పరీక్షల సమయంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులను అప్రమత్తం చేస్తూ అధికారులు ఫోన్లను సైలెంట్లో ఉంచుకోవాలని, తలుపులు లాక్ చేసుకోవాలని సూచించారు.